Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తినాలనే ఆశతో దేవుడు హుండీకే కన్నంవేసిన చిన్నారులు!! (video)

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (10:50 IST)
ఆ ఇద్దరు చిన్నారులకు బిర్యానీ ఆరగించాలని ఆశ కలిగింది. కానీ, చేతిలే పైసా లేదు. మరి బిర్యానీ తినాలన్న ఆశ ఎలా నెరవేర్చుకోవాలి. అపుడే వారికి ఓ ఐడియా వచ్చింది. సమీపంలోని గుడిలో ఉన్న దేవుడి హుండీపై వారి కన్నుపడింది. అంతే.. ఆ హుండీని పగులగొట్టి.. అందులోని డబ్బులు తీసుకెళ్లి పుష్టిగా బిర్యానీ ఆరగించారు. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల ఆంజనేయస్వామి గుడిలో ఈ నెల 26వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు పలుగుతో గుడి తాళం పగులగొట్టి, అదే పలుగుతో హుండీని ధ్వంసం చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ దొంగతనానికి పాల్పడింది అదే మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇద్దరు బాలురుగా గుర్తించారు. వారిని విచారించగా బిర్యానీ తినాలనే కోరికతోనే హుండీ పగుల గొట్టి అందులో నుంచి రూ.140 తీసుకున్నామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments