Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ భీమవరం సభలో కత్తి కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు!!

వరుణ్
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఓ కత్తి కలకలం చెలరేపింది. ఈ సభలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారిలో ఒకరి నుంచి చాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దండగులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై దాడి చేసేందుకు యత్నించారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆదివారం వారాహి యాత్రను నిర్వహించారు. ఈ సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వారిలో ఒకరి నుంచి చాకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, వారిలో ఒకరు పోలీసులపైనే దాడి చేశారు. 
 
చివరకి టూ టౌన్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు జేబు దొంగలా లేదంటే పవన్ కళ్యాణ్‌‌పై దాడి కోసమే వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments