Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మాయ.. ఒక వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒక మహిళకు 18 మంది భర్తలు..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన అభ్యర్థులు గెలిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారు. దాని ఫలితమే ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒకే మహిళకు 18 మంది భర్తలు అని పేర్కొన్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి స్పందించారు. కాల మహిమా లేక కలి మాయా లేక జగన్ మాయనా అంటూ కామెంట్స్ చేశారు. ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు, ఒకే మహిళకు 18 మంది భర్తలు ఇలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇది బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన మాయ అంటూ విమర్శించారు. 
 
దొంగ ఓట్లతో, నోట్ల కట్టలతో అప్రజాస్వామిక పద్ధతిలో బరి తెగించి గెలవాలని వైకాపా భావిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బోగస్ ఓట్లను సృష్టించడం దురదృష్టకరమని చెప్పారు. దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికలు కూడా సజావుగా సాగేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments