Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మాయ.. ఒక వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒక మహిళకు 18 మంది భర్తలు..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (16:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన అభ్యర్థులు గెలిచేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం బోగస్ ఓట్లను సృష్టిస్తున్నారు. దాని ఫలితమే ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు... ఒకే మహిళకు 18 మంది భర్తలు అని పేర్కొన్నారు. 
 
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి స్పందించారు. కాల మహిమా లేక కలి మాయా లేక జగన్ మాయనా అంటూ కామెంట్స్ చేశారు. ఒకే వ్యక్తికి 11 మంది తండ్రులు, ఒకే మహిళకు 18 మంది భర్తలు ఇలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇది బోగస్ ఓట్ల నమోదు కోసం జరిగిన మాయ అంటూ విమర్శించారు. 
 
దొంగ ఓట్లతో, నోట్ల కట్టలతో అప్రజాస్వామిక పద్ధతిలో బరి తెగించి గెలవాలని వైకాపా భావిస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బోగస్ ఓట్లను సృష్టించడం దురదృష్టకరమని చెప్పారు. దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికలు కూడా సజావుగా సాగేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments