రూ.30లకు తిరుమల కొండపై వెదురు వాటర్ బాటిల్స్

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (13:13 IST)
bamboo water bottles
కలియుగ వైకుంఠం తిరుపతి కొండపైకి ప్లాస్టిక్ వస్తువులను తీసుకురావడం నిషేధం. వీటికి బదులుగా వారు స్టీల్ బాటిళ్లను విక్రయించారు. అలాగే భక్తులకు ప్రసాదం లడ్డూలు అందజేసే ప్లాస్టిక్ బ్యాగులకు బదులు జనపనార సంచులను వినియోగిస్తున్నారు. 
 
కానీ భక్తులకు విక్రయించే స్టీల్ బాటిళ్లను రూ.300, రూ.400లకు విక్రయించారు. వాటిని కొనుగోలు చేసి వినియోగించుకోలేక సామాన్య భక్తులు అవస్థలు పడ్డారు. దీనిపై వారు తిరుపతి దేవస్థానం అధికారులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. 
 
దీంతో దేవస్థానం అధికారులు వెదురుతో చేసిన తాగునీటి బాటిళ్లను విక్రయించాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఒరిస్సా రాష్ట్రం నుంచి వెదురు తెప్పించి యంత్రాల ద్వారా వెదురు కోసి అందమైన ఆకృతిలో తాగునీటి బాటిళ్లను సిద్ధం చేశారు. వీటిని రూ.30కి విక్రయిస్తున్నారు. 
 
వెదురు బాటిళ్లలో నీరు తాగితే తాజా రుచి ఉంటుంది. దీంతో ఈ తాగునీటి బాటిళ్లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. గురువారం 64,707 మంది తిరుపతిని సందర్శించారు. 28,676 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments