Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులకు శుభవార్త: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవారి దర్శనం టిక్కెట్లు..

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (10:47 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం వేచి చూస్తున్న భక్తులకు శుభవార్త. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంచారు. లాక్‌డౌన్ కారణంగా ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు స్వామి దర్శనం టీటీడీ కల్పించింది.
 
ఈ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తూ ప్రతి రోజు 7 వేల మందికే అవకాశం ఇచ్చారు. తాజాగా ఆ కోటాను పెంచారు. దీంతో ఇప్పటి వరకు ప్రతి రోజు 7 వేల మందికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉండగా, ఇక నుంచి 10 వేల మందికి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన టోకెన్ల జారీకి అధికారులు సిద్ధమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజే 7,172 మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు. హుండీ ఆదాయం 42 లక్షలుగా ఉన్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తిరుగిరుల్లో థర్మల్ స్రీనింగ్, శానిటైజేషన్ పక్కాగా చేస్తున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దీంతో పాటు గురువారం నుంచి అక్కడ అధికారులు నో హారన్ జోన్ కూడా అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments