Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవో ధర్మారెడ్డికి ఊరట.. జైలుశిక్షపై తాత్కాలిక స్టే

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (15:16 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన నెల రోజుల జైలు శిక్షనపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 
 
తితిదే ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో తితిదే ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల అపరాధం విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. 
 
కాగా, గతంలో ముగ్గురు తితిదే ఉద్యోగులు తమను క్రమబద్దీకరించేలా తితిదే ఈవోను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించి సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారిని క్రమబద్దీకరించాలని తితిదే ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. కానీ తితిదే ఈవో అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద ఈవోకు నెల రోజుల జైలుశిక్ష విధించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments