Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట : తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు (Video)

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (09:12 IST)
అడ్మినిస్ట్రేషన్ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని, గొడవలు జరుగుతాయని సమాచారం ఉందని ముందుగానే హెచ్చరించానని తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల వైకుంఠ - ఏకాదశి ద్వార దర్శనాలకు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణంగానే తొక్కిసలాట జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ తొత్కిసలాటపై ఆయన స్పందిస్తూ, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాటల్లో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని, జరగరానిది జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 'వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అడ్మిస్ట్రేషన్ లోపం కారణంగా జరిగిందని నాకు అనుమానం ఉంది. ఘటనకు బాధ్యత అధికారులదే కదా. మంగళవారం కూడా నేను అధికారులతో సమావేశమై ఆషామాషిగా తీసుకోవద్దని చెప్పాను. 
 
గొడవలు జరుగుతాయని నాకు సమాచార ముందని హెచ్చరించాను. ఐదు వేలమంది పోలీసులను పెట్టామని, చూసుకుంటామని అధికారులు చెప్పారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటరులో ఓ మహిళ అస్వస్థతకు గురైన క్రమంలో ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అక్కడున్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తోపులాట జరిగింది. అందులో ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది' అని బీఆర్ నాయుడు అన్నారు. 
 
డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాటలో భక్తుల మృతి దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారనీ, గాయపడ్డ వారిని చంద్రబాబు పరామర్శించి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందచేస్తారని వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments