Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి పాలకమండలి సభ్యుడిని తాకిన కరోనావైరస్..!

Webdunia
గురువారం, 2 జులై 2020 (21:35 IST)
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక దూరం, మాస్కులంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అన్ని విధాలుగా జాగ్రత్తలు చెప్పినా కరోనాని మాత్రం జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. 
 
అయితే టిటిడిపైనే కరోనా పంజా విసురుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు గానీ ఆ ధార్మిక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కరోనా రావడం పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా టిటిడి పాలకమండలి సభ్యుడు కుమారగురుకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు.
 
మూడురోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న కుమార గురు పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు ఉదయం రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో కుమారు గురు హోంక్వారంటైన్ లోనే ఉన్నారు. వైద్యులు ఆయనకు ఇంటి వద్దే చికిత్స చేస్తున్నారు.
 
అన్నాడిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఆయన. గత కొన్నిరోజుల ముందు డిఎంకే పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూడా కరోనాతో మృతి చెందడం... అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా రావడంతో రాజకీయ నాయకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. మరోవైపు తమిళనాడులో కరోనావైరస్ కేసులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments