Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:58 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు రకాలైన ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆర్టీసీ సేవలను ప్రజల ముంగింటకు తీసుకెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీలు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లు విధులు నిర్వహించే బస్సులు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ ఆదేశాలను అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు విధిగా పాటించాలని కోరారు. ఒక వేళ రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే మాత్రం అందుకు తగిన కారణాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆయనఆదేశించారు. ఈ నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments