ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:58 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు రకాలైన ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆర్టీసీ సేవలను ప్రజల ముంగింటకు తీసుకెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీలు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లు విధులు నిర్వహించే బస్సులు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ ఆదేశాలను అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు విధిగా పాటించాలని కోరారు. ఒక వేళ రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే మాత్రం అందుకు తగిన కారణాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆయనఆదేశించారు. ఈ నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments