ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం .. రాత్రి 8 గంటల వరకే విధులు...

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:58 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందుకోసం పలు రకాలైన ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని వాటిని పక్కాగా అమలుచేసేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆర్టీసీ సేవలను ప్రజల ముంగింటకు తీసుకెళ్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్న మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే డ్యూటీలు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మహిళా కండక్టర్లు విధులు నిర్వహించే బస్సులు రాత్రి 8 గంటల లోపు డిపోలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ఈ ఆదేశాలను అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు విధిగా పాటించాలని కోరారు. ఒక వేళ రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ వేయాల్సి వస్తే మాత్రం అందుకు తగిన కారణాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలని ఆయనఆదేశించారు. ఈ నిర్ణయంపై టీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments