తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాల్సిందే : బండి సంజయ్

Webdunia
గురువారం, 26 మే 2022 (11:50 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జెట్ స్పీడును ప్రదర్శిస్తున్నారు. అధికార తెరాస పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్ని రేపాయి. తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాలని, ఈ తవ్వకాల్లో శవాలు వస్తే మీవి.. శివలింగాలు వస్తే మావి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే ఉత్తరాదికే పరిమైన మందిర్ - మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణాకు తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన వివాదాస్పద ప్రసంగం చేశారు. 
 
తెలంగాణాలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని పిలుపునిచ్చారు. ఈ తవ్వకాల్లో శవం కనిపిస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మాత్రం మేము తీసుకుంటామని అన్నారు. 
 
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెల్సిందే. దీన్ని ప్రధానంగా ప్రస్తావించిన బండి సంజయ్... తెలంగాణాలోని మసీదులను తవ్వినా శివలింగాలు బయటపడతాయన్నారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసివేస్తామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments