ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. ఇవ్వడం కష్టమని ఆ నాడు తెలియదా? : ఎంపీ కవిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెరాస చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె కవిత అన్నారు. ఆమె గురువారం నందిగామలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెరాస చీఫ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కె కవిత అన్నారు. ఆమె గురువారం నందిగామలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. నాటి ప్రధానితో పాటు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాంకేతికంగా ఇవ్వలేక పోయినా.. రాజకీయపరంగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అసలు 'దక్షిణాది రాష్ట్రాలకు హోదా ఇవ్వడం కష్టమంటున్న పాలకులకు అప్పట్లో ఆ విషయం తెలియదా? ఆచరణ సాధ్యం కాని హామీని ఎందుకిచ్చారు? ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించిన హోదా హామీని నెరవేర్చాల్సిందే. దీని కోసం ఆంధ్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని ఆమె వ్యాఖ్యానించారు.
హోదాకు రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగని కేంద్రంతో నిత్యం పోరాటాలు చేయలేమన్నారు. కేవలం పాలనాపరమైన సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన జరిగింది తప్ప తెలుగు ప్రజలంతా ఒక్కటేనని స్పష్టంచేశారు.