ఆంధ్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన తెరాస నేత

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:34 IST)
మొన్నటి దాకా... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జోస్యాలు చెప్పుకొచ్చేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాజకీయాలతో తమకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు.
 
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదనీ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారనీ చెప్పుకొచ్చిన ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కేసీఆర్‌ తన కింద పని చేసారని చంద్రబాబు అనడం ఆయన అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పడు అప్పటి సీఎంల కింద పని చేసారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాది అని ఆయన మండిపడ్డారు. 
 
ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చంద్రబాబు గట్టిగా చెప్పలేరనీ... ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, గతంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారని గుర్తుచేసారు. మోడీ, రాహుల్‌ సైతం ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతూ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారనీ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌ తెలంగాణలో ప్రచారం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ.. కొన్ని జాతీయ పార్టీల కంటే తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా కూడా ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments