Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు: కిషన్‌రెడ్డి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (16:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోందని, రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన మూడో రోజు భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయవాద భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేద‌ని, ఒకరో, ఇద్దరో గెలిచినా తిరిగి తెరాస గూటికి చేరుతారని జోస్యం పలికారు.
 
హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా, కోట్లు ఖర్చు పెట్టినా అంతిమంగా ధర్మమే గెలుస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బర్ల నర్సింగరావు ఆయనతో పాటు ఉన్నారు. తొలుత సాయిబాబా గుడి నుంచి వినాయక్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగతినగర్‌లోని చౌక ధరల దుకాణాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి బీబీనగర్‌కు బయల్దేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments