తెలంగాణాలో రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు: కిషన్‌రెడ్డి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (16:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోందని, రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన మూడో రోజు భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయవాద భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేద‌ని, ఒకరో, ఇద్దరో గెలిచినా తిరిగి తెరాస గూటికి చేరుతారని జోస్యం పలికారు.
 
హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా, కోట్లు ఖర్చు పెట్టినా అంతిమంగా ధర్మమే గెలుస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బర్ల నర్సింగరావు ఆయనతో పాటు ఉన్నారు. తొలుత సాయిబాబా గుడి నుంచి వినాయక్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగతినగర్‌లోని చౌక ధరల దుకాణాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి బీబీనగర్‌కు బయల్దేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments