Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రావెల్స్ బ‌స్సులోకి దూసుకుపోయిన ఇనుప‌ చువ్వ‌లు!

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (15:46 IST)
జాతీయ ర‌హ‌దారుల‌పై నిత్యం ప్ర‌యివేటు బ‌స్సుల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డో అక్క‌డ బ‌స్సులు బోల్తా ప‌డ‌టం, లారీల‌ను వెనుక నుంచి గుద్ద‌డం ప‌రిపాటిగా మారింది. మితిమీరిన వేగం, డ్రైవ‌ర్ల నిర్ల‌క్ష్యం ప్ర‌యాణికుల‌కు శాపంగా మారింది. 
 
కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారి ఫ్లై ఓవర్ పై  రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి యానం వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్ర‌మాదానికి గురైంది. బ‌స్సు 38 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా, డ్రైవర్  నిద్ర మత్తులో అతి వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా వెళుతున్న లారీని ఢీకొట్టాడు.

ఇనుప సువ్వల లోడ్ తో  ముందు వెళుతున్న లారీని  కావేరి ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటన లో ముగ్గురుకు ప్రయాణికులకు గాయాలు కాగా,  డైవర్ కి తీవ్రంగా గాయాల‌య్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనం ద్వారా గాయాలైన వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మిగిలిన ప్రయాణికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు దింపారు. పెద్ద  ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకొని మరో బస్సులో మిగిలిన 34 మందిని వారివారి గమ్య స్థానానికి చేర్చారు. కేవలం డ్రైవర్  నిర్లక్ష్యం వల్ల, నిద్ర మత్తులో అతివేగం అదుపు చేయలేక లారీని ఢీకొన్న ట్లుగా ప్రయాణికులు వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments