Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలిలో కేసీఆర్ బంధువులకే చోటు : సతీశ్ మాదిగ

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురికి అవకాశం కలిపిస్తే అందులో ఐదు మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవ్వరూ లేరని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తితిదే పాలక మండలిలో మొత్తం కేసీఆర్ బంధువులు స్నేహితులు ఉన్నారు. మిగతా ఇద్దరు వైకాపాకి చెందినవారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో తితిదే మండలిలో తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు ఇచ్చేవారు. చివరికి విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దళితులకు అవకాశం కల్పించారు. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ ఒక్క దళితుడు, గిరిజనుడు, బీసీలకు అవకాశం కల్పించలేదు. ఈయన ప్రభుత్వంలో మాదిగలకు ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. కనీసం తితిదేలో సభ్యుడుగానైనా నియమించ లేదు. మాదిగలపై కేసీఆర్ భయంకరంగా వివక్ష చూపుతున్నారు అని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments