Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలకమండలిలో కేసీఆర్ బంధువులకే చోటు : సతీశ్ మాదిగ

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:35 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురికి అవకాశం కలిపిస్తే అందులో ఐదు మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవ్వరూ లేరని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తితిదే పాలక మండలిలో మొత్తం కేసీఆర్ బంధువులు స్నేహితులు ఉన్నారు. మిగతా ఇద్దరు వైకాపాకి చెందినవారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో తితిదే మండలిలో తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు ఇచ్చేవారు. చివరికి విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దళితులకు అవకాశం కల్పించారు. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ ఒక్క దళితుడు, గిరిజనుడు, బీసీలకు అవకాశం కల్పించలేదు. ఈయన ప్రభుత్వంలో మాదిగలకు ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. కనీసం తితిదేలో సభ్యుడుగానైనా నియమించ లేదు. మాదిగలపై కేసీఆర్ భయంకరంగా వివక్ష చూపుతున్నారు అని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments