Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు హస్తినకు వెళ్లనున్న సీఎం జగన్ .. రెండు రోజులు మకాం అక్కడే..

Webdunia
బుధవారం, 4 అక్టోబరు 2023 (09:06 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన గన్నవరం నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ రెండు రోజులు పాటు ఉంటారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి సమయాన్ని బట్టి గురువారం లేదా శుక్రవారం ఢిల్లీ నుంచి తిరిగిరానున్నారు.
 
జగనన్న ఇళ్ళ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో గురువారం సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. కానీ దీన్ని హఠాత్తుగా వాయిదా వేసారు. ఆ రోజునే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ తొలిసారిఢిల్లీకి వెళుతుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. నిజానికి జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేక పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments