Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలు లేకుండానే పైతరగతులకు: ఆదిమూలపు సురేష్

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (18:39 IST)
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్థి నేపథ్యంలో పాఠశాలలు మూత పడటంతో.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు.

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విద్యా సంవత్సంలో 6 నుంచి 9 తరగతుల వరకూ పరీక్షలు లేకుండా హాజరు ఆధారంగా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. గోరుముద్దలు పథకం కింద విద్యార్థులకు డ్రై రేషన్ ఇంటికే పంపిస్తామని తెలిపారు.

పది పరీక్షల నిర్వహణపై ఈ నెల 31 అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ జగనన్న గోరుముద్దలు పథకం (మధ్యాహ్న భోజనం) కింద విద్యార్థులకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందించాలని సీఎం ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

కరోనా ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డ్రై రేషన్ 10 రోజులకు అవసరమైన మొత్తం ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 14 వరకూ డ్రై రేషన్ అందిస్తామన్నారు. డ్రై రేషన్ను గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే అందిస్తామన్నారు. వచ్చేనెల 14 తర్వాత పాఠశాలలు తెరిచే అవకాశం ఉంటుందన్నారు.

ఇప్పటికే 1 నుంచి 5వ తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించామన్న ఆయన.. ఈ నెల 31 జరిగే సమీక్ష అనంతరం పది పరీక్షల తేదీలు ప్రకటిస్తామన్నారు. హాజరు ఆధారంగా 6-9 తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments