'జనసేనాని'కి తెలంగాణ గవర్నర్ ప్రశంసలు.. శభాష్ అంటూ ట్వీట్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (10:57 IST)
జనసేనాని, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభినందనలు తెలిపారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిని కూడా ఆమె అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. వారిద్దరికీ గవర్నర్ అభినందనలు తెలపడానికి కారణం లేకపోలేదు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా వారంతా చెన్నై హార్బ‌ర్‌లో చిక్కుకు పోయారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌త్య్య‌ుకారులు అక్క‌డ వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారికి త‌గు స‌దుపాయాలు కల్పించాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి విజ్జప్తి చేస్తూ లేఖ రాశారు.
 
పవన్ కళ్యాణ్ వినతిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణం స్పందించారు. సంబంధిత అధికారులకు అదేశాలకు ఆదేశాలుజారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏపీ మత్స్యకారులకు తగిన సదుపాయాలను కల్పించారు. మ‌త్స్యకారుల ఇబ్బందుల‌ను నివారించ‌డానికి త‌న వంతు పాత్ర‌ను పోషించిన ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను, అందుకు తగినట్లు స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్‌రాజన్ అభినందిస్తూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments