Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా ఆస్తులు లేని చింతా మోహన్‌... రత్నప్రభ ఆస్తులు రూ.25 కోట్లు

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (13:23 IST)
తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైకాపా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ - జనసేన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరంతా ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఘట్టం ముగిసింది.
 
అయితే, ఈ ఎన్నికలో వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతా మోహన్, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వీరిలో రత్నప్రభ అందరి కంటే సంపన్నమైన వ్యక్తిగా నిలిచారు. 
 
గతంలో కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె... తనకు రూ.25 కోట్ల విలువైన ఆస్తి (భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి) ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.3.5 కోట్లుగా పేర్కొన్నారు. రూ.52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
 
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా పని చేసిన చింతా మోహన్ తనకు ఆస్తులు లేవని ప్రకటించడం గమనార్హం. ఇకపోతే, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తనకు రూ.10 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తనకు రూ.40 లక్షల ఆస్తి ఉన్నట్టు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments