ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా?

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:16 IST)
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? బతికివుందా? చచ్చిపోయిందా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఉప ఎన్నికలో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు బయటి ప్రాంత వ్యక్తులు తిరుపతినిలో తిష్టవేశారని ఆరోపించారు. వారిని అరెస్టు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.

అయినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది? బతికివుందా? లేక చచ్చిపోయిందా? రేపు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల మధ్య రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది. పటిష్ఠమైన బందోబస్తు అవసరం. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. 
 
పోలీసు సహాయంతో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు పక్క సమాచారం అందింది. ధర్మ యుద్ధంలో ఓడిపోతామని తెలిసి, జగన్మోహన్ రెడ్డి అధర్మ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ధర్మయుద్ధం జరిగితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments