Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి...

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (10:29 IST)
తిరుమలలో భక్తురాలిపై ఎలుగుబంటి దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళా భక్తురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుమలగిరుల్లో వన్యప్రాణాలు అధికంగా సంచరిస్తున్న విషయం తెల్సిందే. ఇవి కొన్ని సందర్భాల్లో రక్షణ కంచెను దాటి కాలినడక శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులపై దాడి చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు అధిక సంఖ్యలో పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా తిరుమలకు వచ్చిన ఓ యువతి, గోగర్భం డ్యామ్‌లో స్నానం చేసి వస్తుండగా, ఎలుగుబంటి దాడి చేసింది. ఆ భక్తురాలిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి (26)గా గుర్తించారు. హైదరాబాద్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమె తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లో తన అవసరాలకు తగినంత డబ్బులను తల్లి ఇవ్వడం లేదని అలిగిన విజయలక్ష్మి గత శుక్రవారం తిరుమలకు చేరుకుని, అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. 
 
ఈ క్రమంలో సోమవారం గోగర్భం డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె, స్నానానంతరం అడవి వైపు వెళ్లగా, అక్కడే కాచుకుకూర్చున్న ఎలుగు దాడి చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె, కేకలు వేస్తూ పరుగులు పెట్టగా, గమనించిన ఇతర భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments