Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కలకలం.. భక్తులు అలెర్ట్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (13:00 IST)
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. అలిపిరి నడకదారిలోని నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తారు. 
 
మరోవైపు చిరుతపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డయిందని.. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది. 
 
అలిపిరి నడకదారిలో చిరుతల సంచారం కలవరపెడుతోంది. గతంలో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఓ బాలుడిపై దాడి చేసి గాయపర్చిన చిరుత బాలికను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎముకలు అమర్చి ఐదు చిరుతలను పట్టుకున్నారు.
 
చిరుతల సమస్య తీరిపోయిందని భావించారు. అయితే తాజాగా మరో చిరుత సంచారం కలకలం రేపింది. భక్తుల రక్షణ కోసం టీటీడీ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి 10 గంటల తర్వాత నడకదారిపైకి ఎవరినీ అనుమతించరు.
 
ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే. పైగా, 12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాక్‌వేపైకి అనుమతించరు. చిరుతల నుంచి భక్తులను రక్షించేందుకు టీటీడీ కర్రలు పంపిణీ చేస్తోంది. భక్తులు కూడా గుంపులుగా నడవాలని.. గార్డులను కూడా నియమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments