Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల భక్తుల రద్దీ: తితిదే వీఐపి బ్రేక్ దర్శన్ ఆగస్టు 21 వరకూ బంద్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (09:10 IST)
భక్తుల రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అంచనాకు మించి వుంది. ఈ కారణంగా టీటీడీ సిఫార్సు లేఖలపై ఆగస్టు 21 వరకు వీఐపీ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు వేంకటేశ్వరుని దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 
శ్రీవారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు మహా ధార్మిక ఘట్టం జరగనున్నాయి. “బ్రహ్మోత్సవాలలో ప్రముఖ వాహన సేవలు అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, అక్టోబర్ 2న స్వర్ణ రథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం” అని తెలియజేశారు.

 
ధ్వజారోహణం కార్యక్రమం కారణంగా మొదటి రోజు, పెద్ద శేషవాహనం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన అన్ని రోజులలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments