Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండ భక్తులతో కిటకిట - సెలవు దినాలు ముగుస్తుండటంతో...

Webdunia
మంగళవారం, 24 మే 2016 (12:00 IST)
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తుల పడిగాపులుకాస్తున్నారు. తలనీలాల నుంచి దర్శనం వరకు ప్రతిచోట కూడా భక్తులు పడిగాపులు గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. గదులు దొరక్క రోడ్లపైనే సేదతీరుతున్నారు. గత మూడురోజులుగా ఇదే పరిస్థితి. 
 
సెలవు దినాలు ముగియనున్న కారణంగా భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు వస్తున్నారన్న తితిదే భావిస్తోంది. రోజురోజుకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. మంగళవారం ఉదయానికి సర్వదర్సనం కంపార్టుమెంట్లతో పాటు కాలినడక క్యూలైన్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ బయటకు వచ్చేశాయి. చంటిబిడ్డలతో కొంతమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్సనం భక్తులకు 10గంటల్లోను, కాలినడక భక్తులకు 8గంటల్లోను దర్సనం కల్పిస్తామని తితిదే చెబుతోంది.
 
గదులు లభించే సిఆర్‌ఓతో పాటు ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,365మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2కోట్ల 77లక్షల రూపాయలు లభించింది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments