Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పాప ఖరీదు రూ.10 లక్షలా? మీ ఆర్థిక సాయం మాకు అక్కర్లేదు : బేబీ లక్షిత తాత

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (10:00 IST)
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి దాడి కేసులో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తమ కుమారుడికి వెంట్రుకలు తీసుకునేందుకు తిరుమలకు నడిచి వెళుతుండగా, చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే, మృతురాలి కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు రూ.10 లక్షల ఆర్థికసాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వీటిపై లక్షిత తాత శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. అసలే బిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. మా పాప ప్రాణంఖరీదు రూ.10 లక్షలుగా నిర్ణయించారని, అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని ఆయన తెల్చి చెప్పారు.
 
తిరుమల కొండలపై జింకలకు ఇచ్చే రక్షణ భక్తులకు లేదన్నారు. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన అనారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పిలు సంచారం ఉన్నట్టు పత్రికల్లో నిరంతరం వార్తలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కంచ వేసివుంటే బిడ్డ ప్రాణాలతో ఉండేదని బోరున విలపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ఆయన కోరారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని, మాలాంటి సాధారణ భక్తులు మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments