Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు... తిరుమలకు నిమిషానికో బస్సు...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు తిరుపతి ఆర్ఎం చెంగల్ రెడ్డి. బ్రహ్మోత్సవాల నుంచి 165 కొత్త బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులలో నడుపుతామని చెప్పారు. సాధారణ రోజుల్లో 1600 ట్రిప్‌లను

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:10 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు తిరుపతి ఆర్ఎం చెంగల్ రెడ్డి. బ్రహ్మోత్సవాల నుంచి 165 కొత్త బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులలో నడుపుతామని చెప్పారు. సాధారణ రోజుల్లో 1600 ట్రిప్‌లను తిరుపతి నుంచి తిరుమలకు తిరుమల నుంచి తిరుపతికి నడుపుతామని బ్రహ్మోత్సవాల సమయంలో 2,600 ట్రిప్పులను నడపేందుకు సిద్థంగా ఉన్నామని చెప్పారు. ఒక్క గరుడ సేవ రోజు, గరుడసేవ మరుసటి రోజు 3,600 ట్రిప్పులను తిరుమల-తిరుపతి, తిరుపతి నుంచి తిరుమలకు నడుపనున్నట్లు ఆర్ ఎం చెంగల్ రెడ్డి తెలిపారు.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సహాయక్ పేరుతో విద్యార్థులు భక్తులకు సేవ చేస్తారని చెప్పారు కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీనివాస్. తొమ్మదిరోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవ చేసేందుకు కొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చారని, వారిని దృష్టిలో ఉంచుకుని గరుడ సహాయక్ పేరుతో సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నామన్నారు. పోలీసుల పర్యవేక్షణలో గరుడ సహాయక్ విద్యార్థులు విధులను నిర్వర్తిస్తారన్నారు. వాహనసేవ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరిస్తారని చెప్పారు. విద్యార్థులకు లోగో, టోపీ, జాకెట్స్ ను కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ మహంతిలు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments