Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతకనివ్వట్లేదు.. అందుకే చనిపోతున్నాం.. టిక్ టాక్ ప్రేమ జంట

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:04 IST)
టిక్ టాక్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ.. మంగళగిరికి చెందిన పవన్ కుమార్‌లకు.. టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో... ఆగస్టు మూడో తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
ఇల్లు అద్దెకు తీసుకుని కొత్తకాపురం ప్రారంభించారు. ఇదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటర్ అయ్యారు. పవన్‌ను వదిలేసి ఇంటికి రావాలని శైలజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుండి శైలజ సెల్ ఫోన్ కూడ వాడటం మానేసింది. ఆ తరువాత పవన్ కుమార్‌కు.. శైలజ బందువులు ఫోన్ చేసి చంపుతామని బెదిరించారు.
 
కలసి బతకలేని స్థితి ఏర్పడిందని భావించిన శైలజ దంపతులు... చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు శైలజ... సూసైడ్ లెటర్ రాసింది.
 
తల్లి హేమలత, తండ్రి రవీంద్రతో పాటుగా బంధువు సుబ్రహ్మణ్యం పేరును శైలజ ప్రస్తావించింది. తమ చావుకు ఈ ముగ్గురే కారణమని లిఖిత పూర్వకంగా తెలిపింది. కేసు నమోదు చేసిన బెల్లంకొండ పోలీసులు.... మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments