Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగు ప‌డుతుంద‌ట‌... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! ఎక్క‌డ‌?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:19 IST)
అస‌లే ఈ మ‌ధ్య వాతావ‌ర‌ణం బాగోలేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద‌యం మండుటెండ‌... భ‌రించ‌లేని ఉక్క‌పోత‌... సాయంత్రం ఉరుములు మెరుపుల‌తో వ‌ర్షం. అంతా తేడాగా ఉంద‌ని అంద‌రూ భావిస్తున్న వేళ‌... విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ పిడుగు లాంటి వార్త చెప్పారు.

తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక ఉంద‌ని... అక్క‌డి ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని ముంద‌స్తుగా స‌మ‌చారం అందించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, కడియం, కొత్తపేట, ఆత్రేయపురం ,రావులపాలెం, ఆలమూరు, మండపేట, కపీలేశ్వరపురం, కాజులూరు, తాళ్లచెరువు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అయినవల్లి, పామర్రు, రామచంద్రాపురం ప్రాంతాల్లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంది.

అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా న‌ల్లజేర్ల, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి, చాగల్లు, నిడదవోలు, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం,పేరవల్లి, ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర, ఉంగుటారు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చ‌రించారు. ఎవ‌రూ చెట్ల కింద‌, బహిరంగ ప్రదేశాల్లో ఉండవ‌ద్ద‌ని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments