Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి ఆ చిన్నారి బడికెళ్లాడు.. చిదిమేసిన కారు.. ముందు చక్రాల కింద?

తొలిసారిగా ఆ చిన్నారి బడికి వెళ్తున్న వేళ.. అతడిని మృత్యువు వెంటాడింది. పాఠశాల ముందే చిన్నారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (12:06 IST)
తొలిసారిగా ఆ చిన్నారి బడికి వెళ్తున్న వేళ.. అతడిని మృత్యువు వెంటాడింది. పాఠశాల ముందే చిన్నారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆ చిన్నారి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. హఫీజ్ బాబా నగర్‌లో నివసించే మహబూబ్ అలీ, ముబీన్ బేగం దంపతులకు రహ్మాన్ అలీ అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
రహ్మాన్ అలీని సమీపంలోని నర్సరీలో చేర్పించారు. రంజాన్ పండుగ తర్వాత కుమారుడిని తొలిసారిగా ముబీన్ బేగం బడికి తీసుకు వెళ్లింది. ఇంటి నుంచి ఆటోలో బడివద్దకు వెళ్లి, పాఠశాలలోకి వెళుతుండగా, మాతృశ్రీ కాలనీ నుంచి వేగంగా వచ్చిన కారు రెహ్మాన్‌ను బలంగా ఢీకొంది.
 
ఈ ప్రమాదంలో ముందు చక్రాల కింద నలిగిపోయిన రెహ్మాన్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments