సభ్య సమాజం తలదించుకునే రీతిలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో కూకట్పల్లిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపంలోని వెంకటేశ్వరాకాలనీకి చెందిన 38 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, వెంకటేశ్, రవి అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపారు. బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె తెలిపిన సమాచారంతో అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.