Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంల

Webdunia
సోమవారం, 10 జులై 2017 (19:41 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు మహిళలు 
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామానికి చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు దేవుడు త‌మ‌ని పిలుస్తున్నాడంటూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
ధనలక్ష్మి, వైష్ణవి, సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబీకులు, స్థానికులు వెల్లడించారు. పూజలు చేస్తూ.. దేవుడు తమతో మాట్లాడుతున్నాడని.. దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పేవారని.. అయితే ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని అనుకోలేదని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments