Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు బ్రాంచ్ కెనాల్లో ముగ్గురు యువ‌కుల గ‌ల్లంతు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:49 IST)
పుట్టెంటుకులు తీసే కార్య‌క్ర‌మానికి వెళుతూ, తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు ముగ్గురు యువ‌కులు. శుభ‌కార్యానికి వెళుతూ, మ‌ధ్య‌లో ఈత కొట్టాల‌ని వారు ప‌డిన ఆరాటం, చివ‌రికి మృత్యువాత‌కు దారితీసింది.

గుంటూరులోని బ్రాంచ్ కెనాల్‌ (జీబీసీ)లో కండ్లగుంట గ్రామం వద్ద ఈతకు దిగిన ముగ్గురు యువకులు గల్లంత‌య్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. గుంటూరుకు చెందిన కొందరు నకరికల్లు మండలం చల్లగుండ్లలో పుట్టువెంట్రుకల కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిలో ఆరుగురు ఆటోలో, ఇద్దరు బైక్‌పై కండ్లగుంట మీదుగా నరసరావుపేట వెళ్లేందుకు బయలుదేరారు. కండ్లగుంట వద్దకు రాగానే వీరిలో ముగ్గురు స్నానానికి దిగారు. స్నానానికి దిగిన వారిలో వుల్లంగుల కోటేశ్వరరావు, పగడాల అశోక్‌ (34), ఆటో డ్రైవర్‌ సామి సురేష్‌బాబు (36)లు ఉన్నారు. వీరు ముగ్గురు ప్రవాహంలో కొట్టుకుపోగా, ఆటో డ్రైవర్‌ సురేష్‌బాబు మృతదేహాన్ని బయటకుతీశారు. అశోక్‌, కోటేశ్వరరావుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నకరికల్లు ఎస్‌ఐ పి. ఉదయబాబు తన సిబ్బందితో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments