Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో టమోటా దొంగలు... రాత్రికి రాత్రే పంట మాయం

Webdunia
సోమవారం, 17 జులై 2023 (09:08 IST)
చిత్తూరు జిల్లాలో దొంగలు పడ్డారు. అయితే, వీరు చోరీ చేసింది ఇళ్లలో కాదు.. పంట పొలాల్లో. దేశ వ్యాప్తంగా టమోటా ధర ఆకాశాన్ని తాకుతోంది. కేజీ టమోటాలు పలు ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.400 మేరకు పలుకుతున్నాయి. ఈ పెరిగిన ధరలపై జనం గగ్గోలు పెడుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేసి టమోటాలు కొనుగోలు చేయలేని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో రైతు ఉదయ్‌కుమార్‌ పొలంలో శుక్రవారం రాత్రి దుండగులు రూ.50 వేల విలువచేసే టమాటాలను రాత్రికి రాత్రే కోసుకెళ్లిపోయారు. ముప్పాతిక ఎకరంలో సాగు చేయగా.. శనివారం మూడో కోత కోయాల్సి ఉండగా శుక్రవారం రాత్రే అర ఎకరంలో దొంగతనం జరిగిందని బాధిత రైతు వాపోయారు. సుమారు 450 కిలోల టమాటాలు చోరీ అయ్యాయని.. వాటి విలువ రూ. 50 వేలు పైనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments