Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో టమోటా దొంగలు... రాత్రికి రాత్రే పంట మాయం

Webdunia
సోమవారం, 17 జులై 2023 (09:08 IST)
చిత్తూరు జిల్లాలో దొంగలు పడ్డారు. అయితే, వీరు చోరీ చేసింది ఇళ్లలో కాదు.. పంట పొలాల్లో. దేశ వ్యాప్తంగా టమోటా ధర ఆకాశాన్ని తాకుతోంది. కేజీ టమోటాలు పలు ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.400 మేరకు పలుకుతున్నాయి. ఈ పెరిగిన ధరలపై జనం గగ్గోలు పెడుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేసి టమోటాలు కొనుగోలు చేయలేని కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో రైతు ఉదయ్‌కుమార్‌ పొలంలో శుక్రవారం రాత్రి దుండగులు రూ.50 వేల విలువచేసే టమాటాలను రాత్రికి రాత్రే కోసుకెళ్లిపోయారు. ముప్పాతిక ఎకరంలో సాగు చేయగా.. శనివారం మూడో కోత కోయాల్సి ఉండగా శుక్రవారం రాత్రే అర ఎకరంలో దొంగతనం జరిగిందని బాధిత రైతు వాపోయారు. సుమారు 450 కిలోల టమాటాలు చోరీ అయ్యాయని.. వాటి విలువ రూ. 50 వేలు పైనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments