Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో యేడాదిన్నరగా ఇంటిలోనే బక్కచిక్కి...

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:28 IST)
స్టే హోం.. స్టే సేఫ్ అనే నినాదాన్ని బాగా పాటించినట్లుంది ఆ కుటుంబం. అందుకేనేమో యేడాదిన్నర నుంచి కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంటికే పరిమితమయ్యారు. కరోనా వస్తుందన్న భయంతో వారు ఇంటిలోనే ఉండిపోయారట. ఈ విషయాన్ని వైద్యులకు స్వయంగా వారే చెప్పారు. 
 
తూర్పుగోదావరిజిల్లా రాజోలు మండలం కడలి ప్రాంతానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు స్త్రీలు ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటిలో ఉన్న తండ్రీకొడుకు మాత్రం అప్పుడప్పుడు బయటకు వచ్చి కావాల్సిన సామగ్రి తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవారు.
 
ఎంతో జాగ్రత్తగా వీరిద్దరు కూడా బయటకు వచ్చేవారు. అయితే వీరికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు మంజూరైంది. వేలిముద్ర వేయాలని వాలంటీర్ వీరు నివాసమున్న ఇంటి దగ్గరకు వచ్చింది. 
 
వారిని చూసి వాలంటీర్ ఆశ్చర్యపోయింది. మహిళలు బక్కచిక్కి కనిపించడంతో ఆ వాలంటీర్ ప్రశ్నించింది. అసలు విషయాన్ని వారు చెప్పడంతో స్థానిక నాయకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళింది. దీంతో వారు ఆ ఐదుమందిని ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా బక్కచిక్కిపోవడంతో వారికి చికిత్స చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments