Webdunia - Bharat's app for daily news and videos

Install App

130 కోట్ల భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది: కేంద్రమంతి పియూష్ గోయల్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (21:02 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి పియూష్ గోయల్. ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయక మండపంలో కేంద్రమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల కేంద్రమంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం ఏమిటో ప్రపంచం చూస్తోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా భావించి 450 దేశాలకు మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
 
75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచి అందించామన్నారు. స్వీయ నియంత్రణ, ఎల్లవేళలా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ పరిశుభ్రమైన తిరుమలగా అధికారులు తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. 
 
80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని.. త్వరలో పూర్తిస్థాయిలో రైల్వేసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో పలు అభివృద్థి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్ళు నడిచేలా అదనపు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments