Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ గారూ... ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో మీకేది ఇష్టం?

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (19:59 IST)
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ మంగళవారం నాడు హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూలును సందర్శించి విద్యార్థులకు తన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి గవర్నరును... మీకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో ఏది ఇష్టం అని ప్రశ్నించాడు. 
 
దీనితో గవర్నర్ నరసింహన్ ఆ విద్యార్థితో... నీకు నీ రెండు కళ్లలో ఏది ఇష్టం అని ప్రశ్నించారు. ఆ విద్యార్థి తనకు రెండు కళ్లూ ఇష్టమే అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు సమాధానం దొరికింది కదా... నాక్కూడా ఏపీ-తెలంగాణ రెండుకళ్లు లాంటివి. నాకు రెండు రాష్ట్రాలు ఇష్టమే అన్నారు. 
 
కాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇదే పాఠశాలలో 1954-55 మధ్య పాఠశాల విద్యను అభ్యసించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని సంజన అభ్యర్థన మేరకు ఈ ఏడాది గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించి సందేశాన్నివ్వాల్సిందిగా కోరారు. విద్యార్థిని అభ్యర్థనను సమ్మతించిన గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరై తన అమూల్యమైన సందేశాన్నిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments