జస్టిస్ రాకేష్ కుమార్ సేవలు శ్లాఘనీయం: చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (19:52 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తన పదవీ కాలంలో ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి కొనియాడారు.

జస్టిస్ రాకేష్ కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో జస్టిస్ రాకేష్ కుమార్ కు జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువాతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్ కుమార్ సేవలను కొనియాడారు. భావితరాలకు ఆయనిచ్చిన తీర్పులు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ అనంతర జీవితం ఆనందమయం కావాలని ఆకాక్షించారు.

క్రీడాకారుడిని కావాలనుకుని న్యాయ వ్యవస్థలోకి వచ్చానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తెలిపారు. న్యాయమూర్తిగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. తన పదవీ కాలంలో సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, న్యాయవాదులకు, తోటి న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు పదవీ విమరణ చేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ కు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అభినందనలు తెలియజేశారు.

చివరగా ‘ఫేర్ వెల్ బై పుషింగ్ ద కార్’ కార్యక్రమంతో జస్టిస్ రాకేష్ కుమార్ కు ఘన వీడ్కోలు పలికారు, ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments