Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్టిస్ రాకేష్ కుమార్ సేవలు శ్లాఘనీయం: చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (19:52 IST)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తన పదవీ కాలంలో ఎన్నో ఉన్నతమైన తీర్పులు ఇచ్చారని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని చీఫ్ జస్టిస్ జేకే.మహేశ్వరి కొనియాడారు.

జస్టిస్ రాకేష్ కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టులో నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో జస్టిస్ రాకేష్ కుమార్ కు జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువాతో చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సత్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్ కుమార్ సేవలను కొనియాడారు. భావితరాలకు ఆయనిచ్చిన తీర్పులు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ అనంతర జీవితం ఆనందమయం కావాలని ఆకాక్షించారు.

క్రీడాకారుడిని కావాలనుకుని న్యాయ వ్యవస్థలోకి వచ్చానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తెలిపారు. న్యాయమూర్తిగా అందించిన సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. తన పదవీ కాలంలో సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, న్యాయవాదులకు, తోటి న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు పదవీ విమరణ చేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ కు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అభినందనలు తెలియజేశారు.

చివరగా ‘ఫేర్ వెల్ బై పుషింగ్ ద కార్’ కార్యక్రమంతో జస్టిస్ రాకేష్ కుమార్ కు ఘన వీడ్కోలు పలికారు, ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments