Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానీయుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (21:00 IST)
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది పోరాటాలు చేశారని, అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగఫలాలనే మనం ఈనాడు అనుభవిస్తున్నామని ఆ మహానీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
 
శనివారం అశోక్ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్బన్ మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఆనాడు ఎందరో దేశభక్తులు అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని, ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో హింస పెరిగిపోతోందని, ప్రతి ఒక్కరూ అహింసా మార్గాల్లోనే నడవాలని కోరారు. నేటి యువతలో చాలామందికి దేశానికి స్వాతంత్ర్యం కోసం ఆనాడు చేసిన పోరాటాలు, త్యాగాలు తెలియవని ప్రభుత్వం నాటి పోరాటాలు తెలిసే విధంగా విద్యార్ధులను చైతన్య పరచాలన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అందరినీ స్మరించుకోవడం మన బాధ్యత అని గద్దె రామమోహన్ తెలిపారు. రేయింబవళ్ళు మన దేశ సరిహద్దుల్లో మనకోసం కాపలా కాస్తున్న సైనిక సోదరులందరికీ సెల్యూట్ తెలియజేద్దామన్నారు. అలాగే కరోనా వైరస్ రాష్ట్రంలో పెద్దఎత్తున విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు తమవంతు కృషి చేయాలని గద్దె రామమోహన్ కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు పొట్లూరి సాయిబాబు, శాయన సత్యనారాయణ, మహ్మద్ హయత్ ఖాన్, గద్దె ప్రసాద్, కామినేని రవికుమార్, గద్దె  రమేష్ గుళ్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments