గుంటూరు అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:03 IST)
Pemmasani
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీ అభ్యర్ధులలో ఒకరి గురించి నెట్టింట చర్చ సాగుతోంది. అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి గుంటూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
 
గుంటూరు నుంచి పోటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ప్రస్తుతం  చర్చ జరుగుతోంది. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ.5784 కోట్లుగా ప్రకటించారు.
 
పెమ్మసాని కోట్ చేసిన సంఖ్యలు క్రింది విధంగా ఉన్నాయి:
చరాస్తులు – రూ. 5598,64,80,786 [రూ. 5598.65కోట్లు]
స్థిరాస్తులు – రూ. 186,62,93,157 [Rs186.63 కోట్లు]
 
దీనిని దృష్టిలో ఉంచుకుంటే, 2019లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి రమేష్ కుమార్ శర్మ (బీహార్ నుండి స్వతంత్ర అభ్యర్థి) రూ. 1107 కోట్ల ఆస్తులను ప్రకటించారు. మన పెమ్మసాని విషయానికి వస్తే, అతను 2019 లో అత్యంత ధనవంతుడు అభ్యర్థి కంటే 5 రెట్లు ఎక్కువ ధనవంతుడు. 
 
పెమ్మసాని చంద్ర శేఖర్ ఎన్నారై వైద్య నిపుణుడు. ఈ ఏడాది ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలకు తన సొంత డబ్బు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడనని ఆయన పలు సందర్భాల్లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments