Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక నుదుటిపై కుంకుమ పెట్టి.... నోట్లో నిమ్మకాయ కుక్కి పూజారి పాడు పని...

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (17:37 IST)
దైవ సన్నిధానంలో వున్న ఆ పూజారి కామాంధుడయ్యాడు. నిత్యం దైవారాధనతో ఆధ్యాత్మిక సాగరంలో వుండాల్సిన ఆ పూజారి అడ్డదారి పట్టాడు. గుడికి దైవ దర్శనం కోసం వచ్చే యువతులపై కన్నేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత చిత్తుచిత్తుగా తన్నులు తిన్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... విజయవాడలోని ప్రకాష్‌ నగర్‌ హరిహర క్షేత్రానికి పక్కనే వున్న ఓ దేవాలయానికి మహిళలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు గత శుక్రవారం ఈ గుడిలో పూజ చేసేందుకు వచ్చారు. అందులో భాగంగా వారు హోమ గుండం వద్ద కూర్చుని వుండగా అక్కడికి పూజారి వచ్చాడు.
 
తను మంత్రోపదేశం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వారిని నమ్మించాడు. నీ చెల్లిని పంపిస్తే మంత్రం చెప్పి పంపిస్తానని ఆమె సోదరితో చెప్పి బాలికను గుడి పక్కనే వున్న గదిలోకి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆ బాలిక నుదుటిపై బొట్టు పెట్టి నోట్లో నిమ్మకాయ పెట్టాడు. ఇక ఆ తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. 
 
ఆలయంలోకి వెళ్లిన తన చెల్లి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె సోదరి లోపలికి వెళ్లి గది తలుపు తీసింది. అంతే... ఆ పూజారి చేస్తున్న అకృత్యాన్ని చూసి షాక్ తిన్నది. తన చెల్లిని తీసుకుని ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు ఆదివారంనాడు చెప్పింది. అప్పటికే ఆ బాలిక జరిగిన ఘటనతో షాక్ చెంది జ్వరంతో అల్లాడిపోయింది.
 
కాగా బాధితురాలి పేరెంట్స్‌తో పాటు ఇరుగుపొరుగువారు కలిసి ఆలయ పూజారి వద్దకెళ్లి అతడిని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments