Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కోర్కె తీర్చేందుకు ఆ తల్లి, పక్కింటి బాలికను గదిలోకి తోసేసింది

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (18:43 IST)
కొడుకు తప్పు చేస్తే దండించాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. అంతేకాదు ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పును జరగకుండా చూసుకోవాలని కొడుక్కి మంచి బుద్ధి చెప్పాలి. కానీ ఈ తల్లి మాత్రం కొడుకు కోరిక తీర్చేందుకు ఏకంగా ఒక బాలిక జీవితాన్ని నాశనం చేసింది.
 
గుంటూరు జిల్లా వినుకొండలో నివాసముండే గోపీనాథ్ అనే యువకుడు ఇంటి పక్కనే ఉన్న 9వ తరగతి బాలికపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. అయితే ఉపయోగం లేకుండా పోయింది.
 
తన కోరికను తల్లికి చెప్పాడు. అలా చేయకూడదు తప్పు అని దండించాల్సిన తల్లి  కొడుకు కోరికను తీర్చేందుకు సిద్ధపడింది. పక్కింటిలో 9వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటికి పిలిపించుకుంది. మాయమాటలు చెప్పింది. కొడుకుని గదిలో వెయిట్ చేయమని చెప్పి యువతికి మాయమాటలు చెప్పి గదిలోకి నెట్టేసింది.
 
ఇంకేముంది ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అంతా అయ్యాక మహాతల్లి బయటకు వచ్చిన బాలికను బెదిరించింది. జరిగిన విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంది. అయితే ఆ బాలిక తిన్నగా వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లీకొడుకులిద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments