Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో డబ్బు ప్రభావం: జేపీ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:24 IST)
రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగిపోవడంతో సంపన్నులే ఎన్నికల బరిలో దిగుతున్నారని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అయిందని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు.

దీనిద్వారా ఇప్పటివరకు 3 రాజ్యాంగ సవరణలు, 8 చట్టాలు సాధించామని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని తెలిపారు. ప్రజల బతుకులు మాత్రం మారట్లేదని.. మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని పేర్కొన్నారు.

ఆచరణలో భారత ప్రజాస్వామ్యం- రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనే అంశంపై హైదరాబాద్​లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 9, 10 తేదీల్లో రాజకీయాల్లో ధన ప్రభావంపై ఐఎస్‌బీలో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తామని జేపీ తెలిపారు.

సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలనే అంశంపై చర్చిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments