Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో డబ్బు ప్రభావం: జేపీ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (05:24 IST)
రాజకీయాల్లో డబ్బు పాత్ర పెరిగిపోవడంతో సంపన్నులే ఎన్నికల బరిలో దిగుతున్నారని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అయిందని లోక్​సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు.

దీనిద్వారా ఇప్పటివరకు 3 రాజ్యాంగ సవరణలు, 8 చట్టాలు సాధించామని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెచ్చుమీరుతోందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ప్రజలకు తాయిలాలు అందించి సరిపెడుతున్నారని తెలిపారు. ప్రజల బతుకులు మాత్రం మారట్లేదని.. మార్చేందుకు నేతలు చొరవ చూపట్లేదని పేర్కొన్నారు.

ఆచరణలో భారత ప్రజాస్వామ్యం- రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనే అంశంపై హైదరాబాద్​లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 9, 10 తేదీల్లో రాజకీయాల్లో ధన ప్రభావంపై ఐఎస్‌బీలో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తామని జేపీ తెలిపారు.

సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలనే అంశంపై చర్చిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments