Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యోపాపం.. తండ్రీ, కూతుళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:12 IST)
పెళ్ళికి వెళ్ళి వస్తూ కారులో సందడి చేస్తూ కూర్చుని ఉంది ఓ కుటుంబం. ఉన్నట్లుండి వరద నీటిలోకి కారు వెళ్ళిపోయింది. దీంతో వారు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ తన భార్య, కుమార్తె అనితతో పాటు బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు చిత్తూరుకు వెళ్ళారు. నిన్న సాయంత్రం రిసెప్షన్ చూసుకుని ఇంటికి కారులో పయనమయ్యారు. 
 
డ్రైవర్ కారును నడుపుతూ పెనుమూరు మండలం కొండయ్యగారి వంక వద్దకు వచ్చాడు. రాత్రి వేళ కావడంతో నీటి ప్రవాహం డ్రైవర్‌కు కనిపించలేదు. అందులోను నిద్రమత్తులో ఉన్నాడు. ఎప్పటిలాగే కారును వాగులో దించాడు. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. 
 
కారు వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్, ప్రతాప్ భార్య ఎలాగోలా వరదనీటి నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రతాప్, ఆయన కుమార్తె అనిత మాత్రం గల్లంతయ్యారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments