Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యోపాపం.. తండ్రీ, కూతుళ్ళు వరద నీటిలో కొట్టుకుపోయారు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:12 IST)
పెళ్ళికి వెళ్ళి వస్తూ కారులో సందడి చేస్తూ కూర్చుని ఉంది ఓ కుటుంబం. ఉన్నట్లుండి వరద నీటిలోకి కారు వెళ్ళిపోయింది. దీంతో వారు కొట్టుకుపోయారు. ఇద్దరు సురక్షితంగా బయటపడితే మరో ఇద్దరు గల్లంతయ్యారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వడ్డిపల్లికి చెందిన ప్రతాప్ తన భార్య, కుమార్తె అనితతో పాటు బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు చిత్తూరుకు వెళ్ళారు. నిన్న సాయంత్రం రిసెప్షన్ చూసుకుని ఇంటికి కారులో పయనమయ్యారు. 
 
డ్రైవర్ కారును నడుపుతూ పెనుమూరు మండలం కొండయ్యగారి వంక వద్దకు వచ్చాడు. రాత్రి వేళ కావడంతో నీటి ప్రవాహం డ్రైవర్‌కు కనిపించలేదు. అందులోను నిద్రమత్తులో ఉన్నాడు. ఎప్పటిలాగే కారును వాగులో దించాడు. దీంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. 
 
కారు వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్, ప్రతాప్ భార్య ఎలాగోలా వరదనీటి నుంచి తప్పించుకున్నారు. కానీ ప్రతాప్, ఆయన కుమార్తె అనిత మాత్రం గల్లంతయ్యారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments