ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లీబిడ్డను చంపేసి తగలబెట్టిన దుండగులు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (11:54 IST)
ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తల్లీబిడ్డను చంపేసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తల్లీబిడ్డను అతికిరాతకంగా చంపేసి తగులబెట్టిన దారుణ ఘటన ఏపీలో జరిగింది. రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
 
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు. రెండేళ్ల చిన్నారి సహా మహిళను అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని సైతం నిర్దయగా కాల్చివేయడం చూపరులను తీవ్రంగా కలసివేసింది.
 
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments