Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లీబిడ్డను చంపేసి తగలబెట్టిన దుండగులు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (11:54 IST)
ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తల్లీబిడ్డను చంపేసి దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తల్లీబిడ్డను అతికిరాతకంగా చంపేసి తగులబెట్టిన దారుణ ఘటన ఏపీలో జరిగింది. రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
 
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు. రెండేళ్ల చిన్నారి సహా మహిళను అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని సైతం నిర్దయగా కాల్చివేయడం చూపరులను తీవ్రంగా కలసివేసింది.
 
స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments