Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా మాట జగన్ వినివుంటే.. సీమాంధ్రులకు కష్టాలుండేవి కాదు : టీజీ వెంకటేష్

సీమాంధ్ర ప్రజలు పలు కష్టాలు పడటానికి ప్రధాన కారణం విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆరోపించారు. నాడు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట విని.. జగన్ కాంగ్రె

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:39 IST)
సీమాంధ్ర ప్రజలు పలు కష్టాలు పడటానికి ప్రధాన కారణం విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆరోపించారు. నాడు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట విని.. జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగివున్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి ప్రధాన కారణం జగన్ అని, ఆయన తొందరపాటు నిర్ణయం కారణంగానే ఏపీ ప్రజలు ఇపుడు అనేక కష్టాలు పడాల్సి వస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి... జగన్ సొంతగా వైకాపాను జగన్ స్థాపించడం వల్లే వీడటంతోనే రాష్ట్రం ముక్కలైందన్నారు. 
 
జగన్ సీఎం పదవి కావాలని అనుకున్నారని, అలా అనుకోకుండా, సోనియా గాంధీ చెప్పిన మాట వినుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అన్నారు. జగన్ బయటకు రావడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో విభజనకు కాంగ్రెస్ అంగీకరించిందని అన్నారు. సీమాంధ్ర ప్రజల కష్టాలకు జగన్ వైఖరే కారణమని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments