Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్షన్ టెన్షన్.. కుప్పంలో రఘువీరను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (17:08 IST)
ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని నిలిపేశారు. ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సంఘటన వివరిలిలా ఉన్నాయి. 
 
కుప్పం నియోజకవర్గంలోని శాంతీపురం మండలంలో ఏడో మైలు వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం భూ సేకరణ చేస్తోంది. ఇందులో భాగంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. వారితో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. రఘువీరారెడ్డి కుప్పం మండలం లక్ష్మీపురం వద్దకు చేరుకోగానే తెదేపా శ్రేణులు ఆయను అడ్డుకున్నాయి.
 
వెళ్లడానికి వీల్లేందంటూ ఆయన వాహనాలకు అడ్డు నిలబడ్డారు. ఈ సందర్భంగా తెదేపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విమానాశ్రయ భూముల రైతులను కలిసి విమానాశ్రయ ఏర్పాటుకు ఎందుకు అడ్డంపడుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు రఘువీరను నిలదీశారు. ఈ సందర్భంగా మరోమారు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో బందోబస్తు నడుమ రఘువీరారెడ్డిని అక్కడి నుంచి పంపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments