Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనుల కోసం 15 రోజుల్లో టెండర్లు : మంత్రి నారాయణ

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:10 IST)
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులకు అమరావతిలో కదలిక ప్రారంభమైంది. 
 
ఇప్పటికే రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేసి కొత్తవి ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. నవంబరు, డిసెంబరు నెలల్లో అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు.
 
360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్ , అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం శుభపరిణామమంటూ ఈ సందర్భంగా మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

క సినిమాలో ఎలిమెంట్ గతంలో చూశామని అనిపిస్తే సినిమాలు ఆపేస్తా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments