Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద గ్యాంగ్ కొట్లాట కేసులో ప‌ది మంది అరెస్ట్

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (23:09 IST)
విజ‌య‌వాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ కేసులో ప‌ది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండ‌ప‌ల్లి వ‌ద్ద కిలేశ‌పురంలోని వాటర్ ఫాల్స్ చూడ‌టానికి వ‌చ్చిన‌ యువ‌కులు... త‌మ‌లోతాము గొడ‌వ‌ప‌డి కొట్టుకున్నారు. దొమ్మిలా ఒకరిపై ఒక‌రు ప‌డి త‌న్నుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి అక్క‌డే ఉన్న క‌ర్ర‌లు, బాదుల‌తో కొట్టుకున్నారు. 
 
ఇబ్రహీంపట్నం ఈ కొట్టాట కేసులో పది మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్ వార్ చేసిన సభ్యుల కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్ప‌డి గాలింపులు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాలు వద్ద గాలిస్తున్నారు.

అయితే, ఇబ్రహీంపట్నంలో జరిగింది గ్యాంగ్ వార్ కాద‌ని, సంఘటనలో పాత నేరస్తులు ఎవరూ లేర‌ని, అలాగే, అక్కడి స్థానికులు కూడా ఎవ‌రూ లేర‌ని ఏసీపీ హ‌నుమంత‌రావు చెప్పారు. కొట్టాట‌కు దిగిన యువ‌కులంతా విజయవాడలోని నున్న, ప్రకాష్ నగర్, సింగ్ నగర్‌కు చెందిన వారేన‌ని తెలిపారు.

ఈ కొట్లాట‌లో ఎవ‌రూ చ‌నిపోలేద‌ని, గాయ‌ప‌డిన యువ‌కుడికి చికిత్స జ‌రుగుతోంద‌ని చెప్పారు. మ‌రికొంత మంది యువ‌కుల కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు. ఎక్క‌డ కొట్లాట‌ల‌కు పాల్ప‌డినా క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని ఏసిపి హనుమంతరావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments