Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త మర్మాంగంపై సలసల కాగే వేడినీళ్ళలో కారం కలిపి పోసిన భార్య.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో భార్యల చేతిలో భర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారు. కొందరు భార్యలు అయితే ఏకంగా కట్టుకున్న వాడిని అంతం చేస్తున్నారు. తాజాగా చిన్నపాటి కలహానికే కట్టుకున్న భర్త మర్మాంగంపై సలసల కాగే వేడి నీ

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (08:35 IST)
ఇటీవలి కాలంలో భార్యల చేతిలో భర్తలు చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారు. కొందరు భార్యలు అయితే ఏకంగా కట్టుకున్న వాడిని అంతం చేస్తున్నారు. తాజాగా చిన్నపాటి కలహానికే కట్టుకున్న భర్త మర్మాంగంపై సలసల కాగే వేడి నీళ్లలో కారం కలిపి భార్య పోసింది. దీంతో ఆయనకు నడుం కింది భాగం వరకు బాగా కాలిపోవడంతో కేకలు వేస్తూ లబోదిబోమంటూ తల్లడిల్లిపోయాడు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ దారుణాన్ని పరిశీలిస్తే..
 
జిల్లాలోని దుమ్ముగూడెం మండలం బండారుగూడెంకొత్తగూడెం(బి. కొత్తగూడెం) గ్రామానికి చెందిన కుంజా నర్సయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు గతంలో మృతిచెందారు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుందని, సోమవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆ సమయంలో బయటకు వెళ్లిపోయిన నర్సయ్య.. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చి నిద్రకు ఉపక్రమించాడు. 
 
ఉదయం జరిగిన గొడవతో భర్తపై కోపంతో ఉన్న రాజమ్మ... అర్థరాత్రి సమయంలో నీటిని బాగా వేడి చేసి.. అందులో కారం కలిపి.. గాఢనిద్రలో ఉన్న నర్సయ్యపై పోసింది. దీంతో నర్సయ్య మర్మాంగం, తొడలు బాగా కాలిపోయాయి. ఈ క్రమంలో నర్సయ్య బాగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి.. వెంటనే అతడిని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అమాయకుడైన భర్తపై రాజమ్మ హత్యాయత్నం చేసిందని గ్రామస్థులు పేర్కొంటుండగా.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదేమీ అందలేదని దుమ్ముగూడెం స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments