Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ ఖాకీని చెప్పుతో కొట్టిన తెరాస మహిళా నేత

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది తెరాస మహిళా నేత. సిర్పూర్ కాగజ్ నగర్ ఫారెస్ట్ అధికారిపై దాడి సంఘటన మరువకముందే మల్కాజిగిరిలో మరో అధికారిపై తెరాస నాయకురాలు దాడికి పాల్పడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తున్నారని ఫోటో తీసినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని చెప్పుతో కొట్టింది. 

మల్కాజిగిరి మౌలాలికి కమాన్ వద్ద ముజఫర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నాడు. గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముజఫర్ ఫోటో తీశాడు. అది గమనించిన గౌస్ కానిస్టేబుల్‌ని బెదిరించి వెళ్లాడు. 15 నిమిషాల తర్వాత మరో నలుగురు వచ్చి కానిస్టేబుల్ ముజఫర్‌పై మౌలాలికి చెందిన టి.ఆర్.ఎస్ నాయకురాలు దాడి చేశారు.

ఆమె పేరు సయ్యద్ మహమ్ముదా బేగం. ఆమె కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. ఆ తర్వాత ఆమె వెంట వచ్చినవారితో పాటు కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారు. కానిస్టేబుల్ వద్ద ఉన్న కెమెరా కూడా లాక్కున్నారు. తనపై జరిగిన దాడిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన ఐదుగురిపై ఐపీసీ 332, 382, 506 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments